దేశీయ మార్కెట్లో సరికొత్త ఎంపీవీ 'ఎం9'ను జేఎస్డబ్ల్యు ఎంజీ మోటార్ ఇండియా త్వరలో లాంచ్ చేయనుంది. దానిలో భాగంగా రూ.51000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ ను ప్రారంభించింది. ఈ కారు పరిమాణం పరంగా కియా కార్నివాల్ & టయోటా వెల్ఫైర్ వంటి వాటికంటే పెద్దదిగా ఉంటుంది. లేటెస్ట్ ఫీచర్స్ తో ఈ ఎంపీవీ మార్చి ప్రారంభంలోనే లాంచ్ కావాల్సి ఉంది. కానీ లాంచ్ వాయిదా పడింది. ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయం కంపెనీ ప్రస్తుతానికి వెల్లడించలేదు. దీని ధర రూ. 65 లక్షల కంటే ఎక్కువ ఉంటుందని సమాచారం. రెండు సన్రూఫ్లు, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, హీటింగ్, వెంటిలేషన్, మసాజ్ ఫంక్షన్లతో పవర్డ్ ఫ్రంట్ అండ్ రియర్ సీట్లు, ఫోల్డ్ అవుట్ ఒట్టోమన్ సీట్లు, పవర్డ్ రియర్ స్లైడింగ్ డోర్లు, రియర్ ఎంటర్టైన్మెంట్ స్క్రీన్లు వంటి వాటితో పాటు.. లెవల్ 2 ADAS కూడా ఈ కారులో ఉండనుంది. బ్యాటరీ, రేంజ్ వంటి వివరాలు అధికారికంగా వెల్లడి కాలేదు.
ఎంపీవీ 'ఎం9' బుకింగ్స్ ప్రారంభం !
May 11, 2025
0
Tags