టర్కీలోని కోన్యాలో భూకంపం వచ్చినట్లు తెలుస్తోంది. రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైంది.ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టానికి సంబంధించిన సమాచారం రాలేదు. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్ స్కీ ప్రస్తుతం పర్యటిస్తున్న దేశ రాజధాని అంకారాలో కూడా భూకంపం వచ్చింది. టర్కీ సెంట్రల్ అనటోలియా ప్రాంతంలోని కోన్యా ప్రావిన్సులోల భూకంపం సంభవించింది. ఈ భూకంపం ఇస్తాంబుల్, అంకారా లతో పాటు ఇతర ప్రాంతాలను కుదిపేసింది. 16 మిలియన్ల జనాభా ఉన్న ఇస్తాంబుల్ నగరంలోని పలు ప్రాంతాల్లో జనాలు భయాందోళనతో పరుగులు తీశారు. అనేక మంది గాయపడినట్లు తెలుస్తోంది.
టర్కీలో భారీ భూకంపం : 5.2 తీవ్రత నమోదు
May 15, 2025
0
Tags