2022లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిక్రూట్మెంట్ కోసం సూపర్న్యూమరీ లేదా అదనపు పోస్టుల సృష్టిపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలన్న కలకత్తా హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఈ రోజు రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో విద్యా శాఖ అవసరమైన సంప్రదింపులతో పాటు గవర్నర్ ఆమోదంతో మాత్రమే అదనపు పోస్టులను సృష్టించినందున న్యాయపరమైన జోక్యం అవసరం లేదని తెలిపింది. అయితే, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిక్రూట్మెంట్ కోసం అదనపు పోస్టులను సృష్టించడం “చట్టబద్ధం కాదు” అని కలకత్తా హైకోర్టు తెలిపింది. ఈ నిర్ణయానికి సంబంధించి ప్రశ్నించడానికి మంత్రివర్గ సభ్యులను కస్టడీలోకి తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ కేంద్ర దర్యాప్తు సంస్థను ఆదేశించింది. కాగా, సీబీఐ దర్యాప్తుకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు నిలిపివేసింది.
కలకత్తా హైకోర్టు నిర్ణయాన్నిరద్దు చేసిన సుప్రీంకోర్టు
April 08, 2025
0
Tags