దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసులో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పును సమర్ధించింది తెలంగాణ హైకోర్టు

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పును హైకోర్టు సమర్ధించింది. పేలుళ్లకు పాల్పడ్డ ఐదుగురికి ఉరి శిక్ష సరైనదేనని తీర్పునిచ్చింది. 2013లో దిల్‌సుఖ్‌నగర్‌లో పేలుళ్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పేలుళ్లలో 18 మంది మృతి, 130 మందికి గాయాలు అయ్యాయి. ఈ విషాద ఘటన నగర ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. 2016లో ఎన్ఐఏ ఫాస్ట్‌ట్రాక్‌కోర్టు యాసిన్ భత్కల్ సహా ఐదుగురికి ఉరిశిక్ష విధించింది. అయితే కింది కోర్టు తీర్పుపై ముద్దాయిలు హైకోర్టును ఆశ్రయించారు. ప్రధాన నిందితుడు రియాజ్‌భత్కల్ ఇప్పటికి పరారీలో ఉన్నాడు. ఈ జంట పేలుళ్లకు ప్రధాన కారకుడైన యాసిన్‌ భత్కల్‌ అని పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)