హైద్రాబాదు లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లోని జీఎంఆర్ ఏరో సిటీలో టెక్నిప్ ఎఫ్ఎంసీ కంపెనీ తన నూతన విడిభాగాల తయారీ, పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించింది. సముద్ర ఉపరితలపు భాగాలు, శక్తి రంగానికి సంబంధించిన ప్రత్యేకమైన పరికరాలపై ఈ కంపెనీ పరిశోధనలు చేయనుంది. ఈ సందర్భంగా జీఎంఆర్ ఎయిర్పోర్టు ల్యాండ్ డెవల్పమెంట్ సీఈవో శ్రీ అమన్ కపూర్ మాట్లాడుతూ పెరుగుతున్న పారిశ్రామిక సముదాయంలో టెక్నిప్ ఎఫ్ఎం ఒకటని చెప్పారు. ఆధునిక శిక్షణ, పర్యవేక్షణ ఉద్యోగ అవకాశాల కేంద్రంగా జీఎంఆర్ ఎయిరోసిటీ ఉంటోందని చెప్పారు.
జీఎంఆర్ ఏరో సిటీలో పరిశోధనా కేంద్రం ప్రారంభం
April 30, 2025
0
Tags