టీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. మే 6 అర్ధరాత్రి నుంచి సమ్మె చేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. ఈ మేరకు సంస్థ ఎండీ సజ్జనార్, లేబర్ కమిషనర్కు ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె నోటీసులు ఇచ్చారు. మే 7వ తేదీ మొదటి డ్యూటీ నుంచి విధులు బహిష్కరిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇవాళ్టి వరకు ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు పడలేదని నోటీసుల్లో పేర్కొన్నారు.
మే 6 అర్ధరాత్రి నుంచి టీఎస్ ఆర్టీసీ కార్మికుల సమ్మె !
April 07, 2025
0
Tags