అశోక్ లేలాండ్ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి లోకేష్

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా మల్లవల్లి పారిశ్రామికవాడలో అశోక్ లేలాండ్ బస్సు బాడీ బిల్డింగ్‌ యూనిట్‌ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ యూనిట్‌లో ఎలక్ట్రిక్‌, డీజిల్‌ బస్సుల బాడీ బిల్డింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేసింది హిందూజా గ్రూప్‌.. ఈ ప్లాంట్‌ ఏడాదికి 2,400 బస్సుల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది.. ఇక, ఈ యూనిట్‌ ద్వారా ఫేజ్‌-1లో 600 మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కనుండా.. ఫేజ్‌-2లో 1,200 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని చెబుతున్నారు. దీంతో, అశోక్‌ లేలాండ్‌ అమరావతిలో తొలి ఆటోమొబైల్‌ ప్లాంట్‌గా నిలిచింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)