బ్రిక్స్​ దేశాలు చెల్లాచెదురైపోయాయి​ : డొనాల్డ్​ ట్రంప్​

Telugu Lo Computer
0


డాలర్​కు ప్రత్యామ్నాయం తీసుకొస్తే ఆ దేశాలపై 150 శాతం టారిఫ్​ విధిస్తానని బెదిరించడంతో  బ్రిక్స్​ కూటమి భయపడిపోయిందని అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​ అన్నారు. ''బ్రిక్స్​ దేశాలన్నీ కలిసి డాలర్​ను నాశనం చేయాలని అనుకున్నాయి. వారు కొత్త కరెన్సీ సృష్టించాలని అనుకున్నారు. నేను అధికారంలోకి రాగానే వారికి ఒకటే విషయం చెప్పాను. డాలర్​నాశనం గురించి మాట్లాడే ఏ దేశంపైనైనా 150 శాతం టారిఫ్​ విధిస్తానని హెచ్చరించా. అలాగే, ఆ దేశం నుంచి వస్తువుల దిగుమతిని ఆపేస్తామని చెప్పా. అంతే బ్రిక్స్​ దేశాలన్నీ చెల్లాచెదురైపోయాయి​' అని వ్యాఖ్యానించారు. ''అసలు వారికి ఏమైందో నాకు తెలియదు. ఇప్పుడు ఆ దేశాల మాటే వినిపించడం లేదు' అని వ్యంగ్యంగా అన్నారు. బ్రిక్స్​ ఒక చెడు ఉద్దేశంతో ఏర్పడిందని ఆరోపించారు. ఆ కూటమిలోని చాలామంది దాన్ని కోరుకోరని, ఇప్పుడు దానిగురించి మాట్లాడేందుకు కూడా ఇష్టపడడం లేదని చెప్పారు. ఇప్పుడు బ్రిక్స్​ కూటమే చనిపోయిందని ఎద్దేవా చేశారు. ఈసారి కూడా బైడెన్​అడ్మినిస్ట్రేషన్​ కొనసాగితే కచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం వచ్చేదని ట్రంప్​ అన్నారు. వరల్డ్​ వార్​ ఎంతో దూరంలో లేదని హెచ్చరిస్తూనే.. దాన్ని తన నాయకత్వం నిరోధిస్తుందని చెప్పుకొచ్చారు. మియామిలో జరిగిన ఎఫ్​ఐఐ ప్రయారిటీ సమ్మిట్​లో ట్రంప్​ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''మూడో ప్రపంచ యుద్ధం జరగడం వల్ల ఎవరికీ లాభం లేదు. అయినా వరల్డ్​ వార్​ ఎంతో దూరంలో లేదు. బైడెన్​ సర్కారు మరో ఏడాది కొనసాగితే ప్రపంచం యుద్ధంలో మునిగిపోయేది. ఇప్పుడు అది జరగదు' అని పేర్కొన్నారు. ఈ యుద్ధాల్లో అమెరికా పాల్గొనకపోయినా.. తాను వాటిని ఆపేస్తానని చెప్పారు. అలాగే, రష్యా- ఉక్రెయిన్​యుద్ధంపైనా ట్రంప్​ స్పందించారు. ఈ యుద్ధం ముగింపునకు ఉన్నతస్థాయి చర్చలు ప్రారంభమైనట్టు చెప్పారు. గెలవలేని యుద్ధం కోసం అమెరికాతో ఉక్రెయిన్​ప్రెసిడెంట్ జెలెన్​స్కీ​ 350 బిలియన్​ డాలర్లు ఖర్చు చేయించాడని మండిపడ్డారు. యుద్ధం ఆపేయాలని రష్యా కోరుకుంటున్నదని, త్వరలోనే తాను ఆ దేశ అధ్యక్షుడు పుతిన్​తో భేటీ కానున్నట్టు చెప్పారు.

 

Post a Comment

0Comments

Post a Comment (0)