ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి పార్టీకి దూరం కావడంపై క్యారెక్టర్ ఉన్న వాళ్లే పార్టీలో ఉంటారని అన్నారు.దానిపై విజయ సాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే, ఎవరికీ ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదని విజయ సాయిరెడ్డి వెల్లడించారు. భయం అనేది నాలో ఏ అణువు లోను లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని మరి రాజకీయాలనే వదులుకున్నా అంటూ కౌంటర్ ఇచ్చారు. దీంతో విజయసాయిరెడ్డిచేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని : విజయసాయిరెడ్డి
February 07, 2025
0
Tags