ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో భారత్ నెం.1గా నిలిచింది. ఇంగ్లండ్ను క్లీన్ స్వీప్ చేయడంతో టీమిండియా 119 రేటింగ్లో మొదటి స్థానంలో ఉంది. మరోవైపు ముక్కోణపు సిరీస్ ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించిన న్యూజిలాండ్ జట్టు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో మంచి ఫలితాన్ని సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ విజయం న్యూజిలాండ్ జట్టుకు మనోధైర్యాన్ని మరింత పెంచుతుంది. పాకిస్తాన్ పై విజయంతో న్యూజిలాండ్ వారి వన్డే ర్యాంకింగ్స్లో 100 నుండి 105కి పెరిగింది. దీంతో న్యూజిలాండ్ జట్టు నాల్గవ స్థానానికి చేరుకుంది. ఫైనల్లో ఓడిపోయిన పాకిస్తాన్ 107 రేటింగ్తో మూడవ స్థానానికి పడిపోయింది. అటు శ్రీలంకపై ఆస్ట్రేలియా 0-2 తేడాతో ఓటమి పాలైంది. దీంతో 110 రేటింగ్తో ప్రస్తుత వన్డే ర్యాంకింగ్స్లో రెండవ స్థానంలో ఉంది. కాగా.. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుండి ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నమెంట్ నాటికి ఈ జట్ల ఐసీసీ ర్యాంకింగ్స్పై ప్రభావం పడవచ్చు. టోర్నమెంట్ ఫైనల్ మార్చి 9న జరుగుతుంది.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టీమిండియాకు నెం.1
February 15, 2025
0
Tags