ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామంలో ఉన్న ఇండియన్ బ్యాంక్ ఏటీఎంలో రెండు రోజుల క్రితం పాతూరుకి చెందిన అంజిబాబు అనే ఇండియన్ బ్యాంకు ఖాతాదారుడు క్యాష్ డిపాజిట్ చేయడానికి వెళ్లాడు. అయితే, డిపాజిట్ చేసిన నోట్లలో 18 వేల రూపాయల దొంగ నోట్లు ఉండడంతో అకౌంట్లో ఆ మొత్తం జమ కాలేదు. తాను 50,000 డిపాజిట్ చేయగా అందులో 18,000 డిపాజిట్ అవ్వలేదని బ్యాంకు మేనేజర్ కు సదరు ఖాతాదారుడు ఫిర్యాదు చేశాడు. దీంతో దానిపై ఆరా తీశారు బ్యాంకు అధికారులు. ఖాతాదారుడు జమ చేసిన సొమ్ములో 18 వేల రూపాయలు దొంగ నోట్లుగా గుర్తించారు. ఆ తర్వాత దొంగ నోట్ల వ్యవహారంపై తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసలు అంజిబాబుకు దొంగనోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆయనకు ఎవరు డబ్బులు ఇచ్చారు.. వాళ్లకు ఎక్కడి నుంచి వచ్చాయి? అనే కోణంలో తాడేపల్లి పోలీసులు విచారణ చేపట్టారు.
తాడేపల్లిలో దొంగ నోట్ల కలకలం !
January 27, 2025
0
Tags