ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల మాజీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను హుటహుటిన ఒడిశాలోని భువనేశ్వర్లో ఉన్న ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన కుమారుడు, ఒడిశా న్యాయ శాఖ మంత్రి పృథ్వి రాజ్ హరిచందన్ తెలిపారు. 2019 నుంచి 2023 వరకు బిశ్వభూషణ్ హరిచందన్ ఆంధ్రప్రదేశ్ కి గవర్నర్గా సేవలు అందించారు.
మాజీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అస్వస్థత !
January 28, 2025
0
Tags