ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వం 'నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు' కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన జగనన్న కాలనీల పేరు మార్చుతూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక పై ఈ కాలనీలకు 'పీఎంఏవై-ఎన్టీఆర్' నగర్గా నామకరణం చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులతో ఆ కాలనీలో రాష్ట్ర ప్రభుత్వ నిధులను కలిపి పక్కా ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
జగనన్న కాలనీల పేరు పీఎంఏవై-ఎన్టీఆర్ నగర్గా మార్పు !
January 10, 2025
0
Tags