ప్రధాని మోడీ మంగళవారం సంగారెడ్డి జిల్లా పటేల్గూడాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ గత పది సంవత్సరాలలో తెలంగాణ కొత్త మైలురాళ్లను సాధించడంలో కేంద్ర ప్రభుత్వం కృషి చేసిందని చెప్పారు. రూ.7 వేల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేసే అవకాశం ఈరోజు తనకు లభించిందని అన్నారు. దేశంలోనే విమానయాన రంగం రికార్డులను బద్దలు కొడుతోందని, గత 10 ఏళ్లలో విమానాశ్రయాల సంఖ్య రెండింతలు పెరిగిందని చెప్పారు.అభివృద్ధి చెందిన భారతదేశం కోసం 140 కోట్ల మంది భారతీయులు సంకల్పించారని, ఆ సంకల్పం సాకారం కావాలంటే మనం మౌలిక సదుపాయాలపై పెట్టుబడి పెట్టాలని తెలిపారు. అందుకే ఈ ఏడాది బడ్జెట్లో మౌలిక సదుపాలయాల అభిృద్దికి రూ. 11 లక్షల కోట్లు కేటాయించామని చెప్పారు. తెలంగాణను దక్షిణ భారతదేశానికి గేట్వే అని పిలవవచ్చని ప్రధాని మోడీ అన్నారు. హైదరాబాద్లోని బేగంపేటలో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు చేశామని చెప్పారు. దేశంలోనే మొదటి సివిల్ ఏవియేషన్ రీసర్చ్ కేంద్రం ఇది అని తెలిపారు. ఈ ఏవియేషన్ కేంద్రం నైపుణ్య శిక్షణకు వేదికగా నిలుస్తుందని అన్నారు. గత పదేళ్లలో దేశంలో మిమానాశ్రయాల సంఖ్య రెట్టింపు అయిందని చెప్పారు. పలు కొత్త రైలు మార్గాలు, పలు రైల్వే మార్గాల్లో విద్యుద్దీకరణ పనులు చేపట్టామని తెలిపారు.ఈరోజు ఘట్కేసర్- లింగంపల్లి ఎంఎంటీఎస్ రైలు సర్వీసు ప్రారంభిచామని చెప్పారు. 6 కొత్త స్టేషన్లను కూడా ఏర్పాటు జరిగాయని చెప్పారు. పారాదీప్ పైప్లైన్ పనులను కూడా ప్రారంభించామని.. ఇది పెట్రోలియం ఉత్పత్తుల రవాణాకు ఎంతో అనుకూలంగా ఉంటుందని చెప్పారు. ఈ పరిణామాలు తెలంగాణ, చుట్టుపక్కల ప్రాంతాల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయని తెలిపారు. ప్రధాని మోడీ ఈరోజు ఉదయం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మహంకాళి అమ్మవారిని దర్శించుకుని, ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
దక్షిణ భారతదేశానికి తెలంగాణ గేట్వే !
March 05, 2024
0
Tags