ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాకు కొంత ఉపశమనం లభించింది. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను వారానికి ఒకసారి కలిసేందుకు ఢిల్లీ లోని రూస్ అవెన్యూ కోర్టు సోమవారం ఆప్ నేతకు అనుమతినిచ్చింది. తన భార్యను వారానికోసారి కలిసేందుకు కస్టడీ పెరోల్కు అనుమతించాలని ఆయన అభ్యర్థించగా కోర్టు అందుకు అంగీకరించింది. న్యాయమూర్తి ఎంకే నాగ్పాల్ ఫిబ్రవరి 2న దరఖాస్తుపై ఈడీకి నోటీసు జారీ చేస్తూ, మొదటి దరఖాస్తు తన రెగ్యులర్ బెయిల్ కోసం, రెండవది అనారోగ్యంతో ఉన్న భార్యను వారానికి రెండు రోజులు కలిసేందుకు కస్టడీ పెరోల్ కోసం అని పేర్కొన్నారు.
వారానికి ఒకసారి భార్యను కలిసేందుకు సిసోడియాకు అనుమతి !
February 05, 2024
0
Tags