హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్ 2 మోడిఫైడ్ రూట్ ప్రతిపాదనలపై మెట్రో రైలు ఎండీ ఎన్వీ ఎస్ రెడ్డి ఇంజనీరింగ్ ఎక్స్ ఫర్ట్స్, మెట్రో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నాగోల్- ఎల్బీ నగర్ - మైలార్దేవ్పల్లి- శంషాబాద్ ఎయిర్పోర్ట్ రూట్ పై చర్చించినట్లు తెలుస్తోంది. నాగోల్-ఎల్బీ నగర్- మైలార్దేవ్పల్లి-ఎయిర్పోర్ట్ లైన్లో ఉన్న చాంద్రాయణగుట్ట వరకు ఎంజీబీఎస్-ఫలక్నుమాను మరో ఒకటిన్నర కి.మీ పొడిగించడంపై చర్చ జరిగింది. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కోసం ఇంటర్ఛేంజ్ స్టేషన్గా చాంద్రాయణగుట్టను అభివృద్ధి చేయడంపై చర్చ జరిగింది. చాంద్రాయణగుట్టలో ఇరుకైన రహదారి వెడల్పు, అక్కడ ఫ్లైఓవర్ ఉనికిని దృష్టిలో ఉంచుకుని రైలు రివర్సల్, స్టేబ్లింగ్ లైన్ల ఏర్పాటులో ఉన్న సంక్లిష్టతలు, సాధ్యమయ్యే సాంకేతిక పరిష్కారాలపై అధికారులతో ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడారు. దేశంలో అందుబాటులో ఉన్న ఇతర సిగ్నలింగ్ టెక్నాలజీలు, కోచ్ల స్వీకరణకు వ్యతిరేకంగా ఒకే విధమైన సిగ్నలింగ్, రైలు నియంత్రణ వ్యవస్థ, కోచ్లను అనుసరించడం వల్ల కలిగే లాభాల నష్టాలపై కూడా సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. కొత్త డిపోల స్థానం, కొత్త ఆపరేషనల్ కంట్రోల్ సెంటర్లు, మైలార్దేవ్పల్లి-ఎయిర్పోర్ట్ రోడ్లో కొంత విస్తీర్ణంలో "ఎట్ గ్రేడ్" మెట్రోను ఏర్పాటు చేయడానికి సాధ్యాసాధ్యాలపై కూడా సమావేశంలో చర్చించారు. ఫేజ్-II లో ఖర్చు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు తక్కువ ఖర్చుతో మెట్రో నిర్మాణానికి చెప్పటాల్సిన అవసరం ఎన్వీఎస్ రెడ్డి అధికారులతో చర్చించారు. కొత్త రూట్లలో మెరుగైన ప్రయాణీకుల సౌకర్యాలు, రైడర్షిప్ను పెంచడం కోసం వివిధ మెట్రోల ఉత్తమ పద్ధతులు, ఫేజ్-1 అభ్యాసాలను అధ్యయనం చేయాలని ఎన్విఎస్ రెడ్డి సీనియర్ ఇంజినీర్లను ఆదేశించారు.
హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్ 2 పై ఎన్వీఎస్ రెడ్డి సమీక్ష !
January 07, 2024
0
Tags