ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం దగ్గర పేలుడు సంభవించింది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రోడ్లోని ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో ‘పేలుడు’ సంభవించినట్లు ఢిల్లీ ఫైర్ సర్వీస్కు కాల్ వచ్చింది. మంగళవారం సాయంత్రం కాన్సులేట్ భవనం సమీపంలో పేలుడు జరిగినట్లు ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ధృవీకరించింది. పేలుడు జరిగిన ప్రదేశానికి సమీపంలో ఇజ్రాయెల్ జెండాతో చుట్టబడిన లేఖ కూడా లభ్యమైందని తెలిసింది. ఈ లేఖ ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి చెందిన రాయబారిని ఉద్దేశించి పంపినట్లు ఆ వర్గాలు తెలిపాయి. “సాయంత్రం 5:08 సమయంలో రాయబార కార్యాలయానికి సమీపంలో పేలుడు సంభవించిందని మేము నిర్ధారించగలము. ఢిల్లీ పోలీసులు, భద్రతా బృందం పరిస్థితిని ఇంకా దర్యాప్తు చేస్తున్నారు” అని రాయబార కార్యాలయ ప్రతినిధి తెలిపారు.
ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో పేలుడు !
December 26, 2023
0
Tags