ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు వైఎస్ భాస్కర్రెడ్డికి ఇచ్చిన ఎస్కార్ట్ బెయిల్ గడువు ముగిసింది. అనారోగ్యం దృష్టిలో ఉంచుకుని భాస్కర్రెడ్డికి సీబీఐ కోర్టు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన సెప్టెంబరు 22 నుంచి నవంబరు 30 వరకు ఎస్కార్ట్ బెయిల్పై ఉన్నారు. గడువు ముగియడంతో శుక్రవారం సీబీఐ కోర్టులో లొంగిపోయారు. ఈనెల 20 వరకు సీబీఐ కోర్టు రిమాండ్ విధించడంతో సీబీఐ అధికారులు భాస్కర్రెడ్డిని చంచల్గూడ జైలుకు తరలించారు.
గడువు ముగియడంతో సీబీఐ కోర్టులో లొంగిపోయిన వైఎస్ భాస్కర్రెడ్డి !
December 01, 2023
0
Tags