కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యపై సమగ్ర దర్యాప్తు జరుగక ముందే నిందలు వేయడంపై భారత హైకమిషనర్ సంజయ్కుమార్ మండిపడ్డారు. నిజ్జార్ హత్యకు సంబంధించి చేస్తున్న ఆరోపణలుపై సాక్ష్యాధారాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఓ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ప్రమేయం ఉందని కెనడా ప్రధాన మంత్రి ట్రూడో చేసిన ఆరోపణలపై ప్రశ్నించారు. ఆయన స్పందిస్తూ విచారణ పూర్తికాక ముందే భారత్ను దోషిగా నిర్ధారించారని.. ఇది చట్టపరంగా సరైందేనా అంటూ ప్రశ్నించారు. భారత్ను విచారణకు సహకరించమని అడిగారని.. అయితే, క్రిమినల్ టర్మినాలజీని ప్రకారం.. ఎవరినైనా విచారణకు సహకరించమని కోరడం.. వారు అప్పటికే దోషి అని అర్థమని తెలిపారు. అయితే, ఆరోపణలకు సంబంధించి ఏవైనా ఆధారాలుంటే ఇవ్వాలని కోరామని, ఇస్తే వాటిని పరిశీలిస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు.
సమగ్ర దర్యాప్తు జరగకుండానే నిందలా ?
November 25, 2023
0
Tags