గుండెపోటుతో సంభవిస్తున్న మరణాలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కీలక సూచన చేశారు. కొవిడ్-19 బారిన పడి కోలుకున్న తర్వాత ఒకటి నుంచి రెండేళ్ల వరకూ ఎక్కువగా శ్రమించకపోవడం మంచిదన్నారు. ఆదివారం గుజరాత్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాండవీయ మాట్లాడారు. ఈ మేరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చేసిన అధ్యయనాన్ని ఉదహరించారు. 'ఐసీఎంఆర్ నిర్వహించిన అధ్యయనంలో తేలిన విషయం ఏమిటంటే.. తీవ్రమైన కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడిన వారు ఆ తర్వాత రెండేళ్ల వరకూ ఎలాంటి కఠిన వ్యాయామాలు లేదా అధిక శ్రమతో కూడిన పనులు చేయకపోవడం మంచిది. అప్పుడు వారు ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ బారిన పడకుండా ఉంటారు' అని మాండవీయ చెప్పారు.
కొవిడ్ రోగులు ఎక్కువగా శ్రమించకపోవడం మంచిది !
October 30, 2023
0
Tags