మణిపూర్ లోని తెంగ్నౌపాల్ జిల్లాలో భద్రతా బలగాలు, సాయుధ సిబ్బంది మధ్య తాజాగా కాల్పులు జరగడంతో మణిపూర్ మళ్లీ ఉద్రిక్తంగా మారింది. ఈ కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. భద్రతా బలగాలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. బిష్ణుపూర్ జిల్లాలోని ఫౌగాక్చావో ఇఖాయ్లో వేలాది మంది నిరసనకారులు గుమిగూడి, టోర్బంగ్లోని వారి నిర్జన గృహాలకు చేరుకునే ప్రయత్నంలో ఆర్మీ బారికేడ్లను ఛేదించడానికి ప్రయత్నించారు. దీంతో శుక్రవారం కాల్పుల సంఘటన జరిగింది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, అస్సాం రైఫిల్స్,మణిపూర్ పోలీసు సిబ్బందితో కూడిన భద్రతా బలగాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు టియర్ గ్యాస్ షెల్స్ను ప్రయోగించడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
మణిపూర్లో భద్రతా బలగాలు, సాయుధుల మధ్య కాల్పులు
September 08, 2023
0
Tags