టెంపోను బస్సు ఢీకొట్టిన ఘటనలో ఐదుగురు దుర్మరణం

Telugu Lo Computer
0


రాజస్తాన్‌లోని దౌసా జిల్లా హిందౌన్ రోడ్డులో టెంపోను బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందగా, మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను మహువ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఓవర్‌టెక్‌ చేసే సమయంలో ప్రమాదం జరిగినట్లు సమాచారం. టెంపోను ఓవర్‌ టెక్‌ చేసే సమయంలో బస్సు ఢీకొట్టిందని సమాచారం. ఈ ఘటనలో ఐదుగురు బస్సు కిందపడి దుర్మరణం చెందారు. టెంపోలో ప్రయాణిస్తున్న ఆరుగు సైతం గాయపడ్డారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో జైపూర్‌కు తరలించారు. కరౌలిలోని కైలా దేవి ఆలయాన్ని సందర్శించి టెంపోలో మెహ్వాకు వెళ్తున్న సమయంలో వస్తుండగా మహ్వా-హిందౌన్ హైవేపై ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. యాత్రికులందరూ కరౌలీలోని హిందౌన్ సిటీ నుంచి మెహ్వాకు టెంపోలో తిరిగి వస్తుండగా రాజస్థాన్ లోక్ పరివాహన్ సేవా బస్సు ఆటో రిక్షాను ఢీకొట్టిందని, దీంతో టెంపో నుజ్జునుజ్జు అయ్యిందని పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)