డ్రైవర్‌ అప్రమత్తతతో తృటిలో తప్పిన ప్రమాదం

Telugu Lo Computer
0


ముంబై లోని థానే మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రజల సౌకర్యార్థం కొన్ని బస్సులను నడుపుతున్నది. ఓ ప్యాసింజర్‌ బస్సు 50 మంది ప్రయాణికులతో వెళ్తుండగా ఆ బస్సు థానే సిటీలో సెంట్రల్‌ గ్రౌండ్‌ సమీపంలోకి రాగానే  ఇంజిన్‌లో సడెన్‌గా పొగలు రావడం మొదలైంది. అది గమనించిన డ్రైవర్‌ ప్రయాణికులను అప్రమత్తం చేసి కిందకు దించుతుండగానే ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. కానీ ప్రయాణికులంతా ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. మహారాష్ట్రలోని థానే సిటీలో ఆదివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.   https://t.me/offerbazaramzon



Post a Comment

0Comments

Post a Comment (0)