తయారీ రంగంలో చైనాకు ప్రత్యామ్నాయంగా మారేందుకు భారత్కు అద్భుతమైన అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా అన్నారు. అయితే, ఈ అవకాశాన్ని చేజిక్కించుకోవడానికి భారత్కు 10 ఏళ్ల సమయం లేదని, దానిని సద్వినియోగం చేసుకోవడానికి మూడు నుంచి ఐదు సంవత్సరాల పరిమిత సమయం మాత్రమే ఉందని అజయ్ బంగా పేర్కొన్నారు. కంపెనీలు పూర్తిగా చైనాను విడిచిపెట్టకపోయినా, సరఫరా గొలుసును బలోపేతం చేయడానికి ఇతర దేశాలలో తయారీని కూడా చూస్తాయన్నారు. ఈ పరిస్థితిలో దృఢ సంకల్పంతో, ఉత్సాహంతో చైనాకు ప్రత్యామ్నాయంగా మారే అవకాశాన్ని భారత్ వినియోగించుకోవాలని బంగా సూచించారు. ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా అధికారాన్ని చేపట్టిన తర్వాత బంగా భారత్కు రావడం ఇదే తొలిసారి. అహ్మదాబాద్లో జరిగిన జీ20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. భారతీయ-అమెరికన్ అయిన బంగా జూన్లో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి అనే రెండు ప్రపంచ ఆర్థిక సంస్థలకు అధిపతిగా ఉన్న మొదటి వ్యక్తిగా నిలిచారు. ప్రపంచంలోని ప్రధాన అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల ఇంటర్గవర్నమెంటల్ ఫోరమ్ అయిన జీ20కి భారతదేశం ప్రస్తుతం అధ్యక్ష పదవిని కలిగి ఉంది. https://t.me/offerbazaramzon
తయారీ రంగంలో చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ !
July 21, 2023
0
Tags