మణిపూర్లో రెండు తెగల మధ్య చెలరేగిన ఘర్షణలతో మణిపూర్ అట్టుడుకుతోంది. ఇద్దరు గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి, అత్యాచారం చేసిన అమానవీయ ఘటన జరిగింది. ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు రాష్ట్ర పోలీసులు తెలిపారు. నిన్న ప్రధాన నిందితుడు హురైన్ను (32) అరెస్ట్ చేయగా, సాయంత్రం మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు తెలిపారు. అయితే ప్రధాన నిందితుడు హురైన్ హెరదాస్ సింగ్ ఇంటికి స్థానికులు నిప్పుపెట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. https://t.me/offerbazaramzon
నిందితుని ఇంటికి నిప్పు పెట్టిన స్థానికులు
July 21, 2023
0
Tags