బ్యాంకు​ క్లర్క్​కు జాక్​పాట్​​ !

Telugu Lo Computer
0


పంజాబ్ లోని గురుదాస్​పుర్​ జిల్లా డేరా బాబా నానక్​ టౌన్​కు చెందిన రూపీందర్​జిత్​ సింగ్ అగ్రికల్చర్​ డెవలప్​మెంట్​ బ్యాంక్​లో క్లర్క్​గా పనిచేస్తున్నాడు. గత సంవత్సరం నుంచి లాటరీ టికెట్లు కొంటున్నాడు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు కూడా రూ.6 చొప్పున నాగాలాండ్ రాష్ట్రానికి చెందిన 25 లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు. అనంతరం బ్యాంకులో తన పనిలో నిమగ్నమయ్యాడు. ఒక గంట సమయం తర్వాత.. 'మీరు రూ.కోటి గెలుచుకున్నారు' అని రూపీందర్​జిత్​కు లాటరీ ఏజెంట్​ నుంచి ఫోన్​ వచ్చింది. దీంతో ఒక గంటలోనే కోటీశ్వరుడయ్యాడు. అయితే తన అలవాటే తనను ఇలా కోటీశ్వరుడిని చేసిందని రూపీందర్​జిత్​ తెలిపాడు. ​రూపీందర్​జిత్​ రూ.కోటి లాటరీ గెలవడం వల్ల బ్యాంకు సిబ్బంది అతడికి అభినందనలు తెలిపారు. కుటుంబసభ్యులు, బంధువులకు, స్నేహితులూ అభినందనలు తెలుపుతూ ఫోన్​ కాల్స్​ చేశారు. ఇదంతా చూస్తుంటే తన కల నిజమైనట్లు ఉందని రూపీందర్​జిత్​ అన్నాడు. తాను గెలిచిన రూ. కోటిని తన పిల్లలు, కుటుంబం భవిష్యత్​ కోసం ఖర్చు చేస్తానని చెప్పాడు. అవసరం ఉన్న పేద ప్రజలకు కూడా సహాయం చేస్తానని అన్నాడు. అయితే, రూపీందర్​ లాటరీ బంపర్ ప్రైజ్ గెలవడం వల్ల  డేరా బాబా నానక్​ టౌన్​ పేరు మరోసారి మారుమోగిపోయింది.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)