గత ఐదేండ్లలో కొత్తగా ఐఐటీ, ఐఐఎం ను ప్రారంభించలేదు !

Telugu Lo Computer
0


మెరికాలో ప్రధాని నరేంద్ర మోడీ  మాట్లాడుతూ ప్రతి ఏడాదీ భారత్‌లో కొత్తగా ఐఐటీ, ఐఐఎమ్‌ విద్యాసంస్ధలు ప్రారంభిస్తున్నామంటూ  చెప్పింది ఉత్త మాటే. రాజ్యసభలో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాన్‌ సర్కార్‌ గత ఐదేండ్లలో దేశంలో కొత్తగా ఐఐటీ కానీ, ఐఐఎం కానీ ప్రారంభించలేదని లిఖిత పూర్వకంగా తెలిపారు. కాంగ్రెస్‌ ఎంపీ కుమార్‌ కేత్కర్‌ అడిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ దేశంలో మొత్తం 23 ఐఐటీలు, 20 ఐఐఎంలు ఉన్నట్టు వెల్లడించారు. ప్రధాని మోదీ ప్రతి ఏడాదీ కొత్తగా ఐఐటీ,ఐఐఎంలను ప్రారంభిస్తున్నట్లు చెప్పుకోవడాన్ని కాంగ్రెస్‌ పార్టీ ట్విట్టర్‌లో దుయ్యబట్టింది.  https://t.me/offerbazaramzon

Post a Comment

0Comments

Post a Comment (0)