అంబానీ ఫోకస్ తన ఫైనాన్స్ వ్యాపారంపైకి మారింది. బజాజ్ ఫైనాన్స్ వంటి సంస్థలతో పోటీ పడేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇటీవల రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి డీమెర్జ్ అయ్యింది జియో ఫైనాన్సియల్స్. ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేసిన తర్వాత దీనిని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ముఖేష్ అంబానీ అమెరికాకు చెందిన ప్రఖ్యాత పెట్టుబడి సంస్థ బ్లాక్రాక్తో కలిసి జాయించ్ వెంచర్ ద్వారా కొత్త వ్యాపారాన్ని విజయపధాన నడిపించాలని నిర్ణయించారు. ఇది కీలకమైన, వ్యూహాత్మకమైన వ్యాపార నిర్ణయంగా మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అంబానీ ప్రపంచంలోని అతిపెద్ద అసెట్ మ్యానేజ్మెంట్ కంపెనీ బ్లాక్రాక్తో కలిసి పనిచేయాలని నిర్ణయించింది. 2018 తర్వాత అమెరికా ప్రఖ్యాత కంపెనీ తాజా చర్యతో తిరిగి భారత మార్కెట్లోకి అడుగుపెడుతోంది.అమెరికా ఆధారిత పెట్టుబడి దిగ్గజం జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కలిసి అసెట్ మేనేజ్మెంట్ వ్యాపారాన్ని సృష్టించడానికి 50:50 నిష్పత్తి ప్రాతిపధికన జాయింట్ వెంచర్ను సృష్టిస్తోంది. కొత్త జాయింట్ వెంచర్ ఏర్పాటుకు రెండు సంస్థలు సంయుక్తంగా 300 మిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టనున్నాయి. చట్టపరమైన అన్ని అనుమతులు పొందిన తర్వాత వీరి జాయింట్ వెంచర్ మెుదలవుతుందని వెల్లడైంది. భారత అసెట్ మేనేజ్మెంట్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేందుకు తాము ఆసక్తిగా బ్లాక్ రాక్ ప్రతినిధి వెల్లడించారు. ప్రస్తుతం జియో ఫైనాన్సియల్స్ మార్కెట్ క్యాప్ దాదాపు 20 బిలియన్ డాలర్లుగా లెక్కించబడింది. https://t.me/offerbazaramzon
ఫైనాన్స్ వ్యాపారంపైకి అంబానీ ఫోకస్ !
July 27, 2023
0
Tags