కోర్టు తన పని తాను చేస్తుంది !

Telugu Lo Computer
0


రెజ్లర్లు తమ ఆందోళనను విరమించుకున్న వేళ దీనిపై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. కోర్టు తన పని తాను చేస్తుందని చెప్పుకొచ్చారు. ” నేను దీనిపై మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు ఇది కోర్టు పరిధిలో ఉంది. న్యాయస్థానం తన పని తాను చేస్తుంది ” అని బ్రిజ్ భూషణ్ అన్నారు. కొన్ని రోజుల క్రితం కూడా ఈ విషయంపై మీడియా ముందు మాట్లాడడానికి ఆయన అంగీకరించలేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అప్పట్లోనూ అన్నారు. ఇక రెజ్లర్ల ఉద్యమం నీరుగారిపోయినట్లేనని ప్రచారం జరుగుతోంది. తమను లైంగిక వేధింపులకు గురిచేసిన బ్రిజ్ భూషణ్ ను అరెస్టు చేయనిదే తాము ఉద్యమాన్ని విరమించబోమని మొదట స్పష్టం చేసిన రెజ్లర్లు ఆ డిమాండ్ నెరవేరకుండానే తమ ఉద్యమాన్ని విరమించారు. ఇక కోర్టులోనే తేల్చుకుంటామని చెబుతున్నారు. దీంతో కొన్ని నెలల్లో జరిగే ఏసియన్ గేమ్స్ లో వారు పాల్గొనే అవకాశం ఉంది. కొందరు రెజ్లర్లు ఇప్పటికే రైల్వే ఉద్యోగాల్లోనూ చేరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)