ఇద్దరు భార్యల నుంచి భరణం ఇప్పించండి !

Telugu Lo Computer
0


కర్నాటక యాదగిరి జిల్లాలోని భీమరాయణగుడికి చెందిన ధారూ రాథోడ్ వ్యవసాయ కార్మికుడు. 40 సంవత్సరాల క్రితం టిప్పిబాయి అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. పదేళ్ల తరువాత కమలీబాయి అనే మరో స్త్రీని కూడా వివాహమాడాడు. ఇద్దరి నుంచి విడిపోయాడు. ఆ తరువాత అతని భార్యలిద్దరూ ఉద్యోగాల్లో స్థిరపడి పిల్లలకు పెళ్లిళ్లు కూడా చేశారు. ప్రస్తుతం రాథోడ్‌కు 65 ఏళ్లు వచ్చాయి. వయసు మీద పడటంతో వ్యవసాయ పనులకు వెళ్లడం మానేశాడు. దాంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. ఈ క్రమంలో అతను భార్యల ఆర్ధిక పరిస్థితిని ఆర్టీఐ ద్వారా ఎంక్వైరీ చేశాడు. మొదటి భార్య 55 సంవత్సరాల టిప్పిబాయి రూ.38,636 , రెండవ భార్య 50 సంవత్సరాల కమలిబాయి రూ.36,896 జీతాలు డ్రా చేస్తున్నట్లు తెలుసుకున్నాడు. వీటి ఆధారంగా చేసుకుని రాథోడ్ వీరిద్దరి నుంచి నెలవారి భరణంగా చెరో రూ.10,000 అంటే నెలకు రూ.20,000 ఇప్పించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)