ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిల జోడీ చరిత్ర సృష్టించింది. మెన్స్ డబుల్స్ విభాగంలో సాత్విక్, చిరాగ్ జోడి ఘన విజయం సాధించి బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో వీరు ప్రపంచ ఛాంపియన్స్ అయిన మలేషియాకు చెందిన ఆరోన్ చియా-సో వుయ్ జోడీని 21-17, 21-18 తేడాతో ఓడించారు. ఇండోనేషియా బ్యాడ్మింటన్ ఓపెన్లో డబుల్స్ కాంబినేషన్లో భారత్ బంగారు పతకాన్ని గెలుచుకోవడం ఇదే తొలిసారి.
చరిత్ర సృష్టించిన సాత్విక్ - చిరాగ్
June 18, 2023
0
Tags