భర్తను చెట్టుకు కట్టేసి నిప్పు పెట్టిన భార్య

Telugu Lo Computer
0


బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లా వాసుదేవ్‌పూర్ సరాయ్ గ్రామానికి చెందిన 25 ఏళ్ల వివాహిత అదే గ్రామానికి చెందిన మరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అయితే ఈ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి, అతడిని అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకుంది. శనివారం రాత్రి సెల్ఫీ తీసుకుందాం  అంటూ భర్తను ఓ చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళింది. అక్కడ అతన్ని మాటల్లో పెట్టి ఉన్నట్టుండి ఓ తాడుతో చెట్టుకు కట్టేసింది. అతడు అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కింది. ఆ తర్వాత కిరోసిన్ తీసుకొచ్చి భర్తపై చల్లి నిప్పు పెట్టింది. మంటలు చెలరేగి పొగరావడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకొని మంటలను ఆర్పారు. ఆ తర్వాత బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని భర్తను చంపేందుకు ప్రయత్నించిన మహిళను అరెస్టు చేశారు. కాగా మంటల్లో గాయపడిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)