కారు అదుపు తప్పి వ్యాన్‌ను ఢీకొన్నఘటనలో నలుగురు మృతి

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి సమీపంలోని చోడవరానికి చెందిన 9 మంది టాటా మ్యాజిక్ వ్యాన్‌లో కొత్తపేట మండలం మందపల్లికి దైవదర్శనం కోసం వెళ్తున్నారు. కోనసీమ జిల్లాలోని ఆలమూరు మండల పరిధిలోని మడికి జాతీయ రహదారిపై  విశాఖ నుంచి వస్తున్న కారు అదుపు తప్పి వ్యాన్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ముగ్గురు, కారులో ప్రయాణిస్తున్న ఒక్కరు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరో 9 మందిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)