కుక్కకు స్నానం చేయించబోయి చెరువులో మునిగిన అన్నాచెల్లెళ్లు !

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని డోంబివలీ దావాడీ ప్రాంతంలోని  ఉమేష్‌నగర్‌కు చెందిన రంజిత్‌ రవీంద్రన్‌ (22), కీర్తి రవీంద్రన్‌ (16) కుటుంబంతో పాటు ఉంటున్నారు. రంజిత్‌ ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం విద్యార్థి. కీర్తి ఈ ఏడాదే 12వ తరగతిలో చేరింది. వారి తల్లిదండ్రులు ఏదోపనిమీద తమ గ్రామానికి వెళ్లారు. దీంతో ఇంటిలో ఈ అన్నాచెల్లెళ్లలోపాటు వారి పెంపుడు కుక్క కూడా ఉంది. ఆదివారం ఈ అన్నాచెల్లెళ్లు స్కూటర్‌పై కుక్కను తీసుకుని గావ్‌దేవి చెరువు దగ్గరకు వెళ్లారు. అక్కడ ఆ కుక్కకు స్నానం చేయించాలనుకున్నారు. ఈ నేపధ్యంలో వారు చెరువులోకి దిగినవెంటనే మునిగిపోయారు. అయితే కుక్క ఈ ప్రమాదం నుంచి బయటపడింది. వారిద్దరూ చెరువులో మునిగిపోవడాన్ని చూసిన ఆ కుక్క పెద్దగా మొరగడం ప్రారంభించింది. కొద్దసేపటి తరువాత కుక్క అలా మొరుగుతుండటాన్ని గమనించిన గ్రామస్తులకు అనుమానం కలిగింది. వారు సంఘటనా స్థలానికి వచ్చి,  ఆ అన్నా చెల్లెళ్లు మునిగిపోయి ఉండటాన్ని గమనించారు. దీంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇంతలో భారీ సంఖ్యలో గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చెరువులో రెండు గంటలపాటు చేసిన ప్రయత్నాల అనంతరం ఆ అన్నాచెల్లెళ్ల మృతదేహాలను బయటకు తీసుకువచ్చారు. అనంతరం ఆ మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)