బండిపోర్ టైగర్ రిజర్వ్ను సందర్శించిన మోడీ

Telugu Lo Computer
0


కర్ణాటకలోని బండిపూర్ టైగర్ రిజర్వ్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ఉదయం సందర్శించారు. ప్రాజెక్ట్ టైగర్ కు 50 ఏళ్లు పూర్తెన సందర్భంగా 20 కి.మీ పాటు మోడీ సఫారీ వాహనంలో ప్రయాణించారు. ఈ సందర్భంగా పులల సంరక్షనుకు చేపట్టిన చర్యలు, జంతువుల కోసం ఏర్పాటు చేసిన నీటి కేంద్రాలు, ఏనుగుల శిబిరాలను అధికారులు ప్రధానికి చూపించారు. తెప్పకాడు ఎలిఫెంట్ క్యాంప్ లో ఏనుగులకు మోడీ ఆహారం తినిపించారు. ఇక్కడే ఆస్కార్ అవార్డు గెలుచుకున్న 'ది ఎలెఫెంట్ విస్ఫరర్స్' మూవీని షూట్ చేశారు. ఆ మూవీలోని రఘు అనే ఎలెఫెంట్ తో పాటు దానిని పెంచిన బొమ్మన్, బెల్లీలను ప్రధాని మోడీ కలుసుకున్నారు. కాగా ప్రాజెక్ట్ టైగర్‌కు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్మారక నాణేన్ని కూడా ప్రధాని మోడీ విడుదల చేయనున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)