పూల వర్షంతో స్వాగతం !

Telugu Lo Computer
0


ఎన్సీపీ ఎమ్మెల్యే ధనంజయ్ ముండే కారు జనవరి 4న పర్లీ నగరంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం తర్వాత ముండె ముంబైలో 39 రోజుల పాటు చికిత్స తీసుకున్నాడు. గాయం నుంచి కోలుకున్న ఆయన ఈరోజు తొలిసారిగా పర్లీలో అడుగుపెట్టారు. ముందుగా ఆయన గోపీనాథ్ కోటకు వెళ్లి దర్శనం చేసుకున్నారు. పర్లీలో అడుగుపెట్టగానే తన తండ్రి పండిట్ అన్నా ముండే సమాధి వద్దకు వెళ్లి వందన సమర్పణ చేశారు. అనంతరం ధనంజయ్ ముండే పర్లీ చేరుకున్నారు. అయితే అతడికి న భూతో న భవిష్యత్ అనేట్లు అభిమానులు ముండేపై పూల వర్షం కురిపించేందుకు 101 జేసీబీలు వాడారు. ఆ జేసీబీల నుంచి 10 టన్నుల పూలవర్షం కురిపించారు. ఈ దృశ్యాన్ని తిలకించేందుకు భారీగా జనం హాజరయ్యారు. డీజే, విద్యుత్ కాంతులను ఏర్పాటు చేసి అభిమానులు కోలాహలం మధ్య ముండేను ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా పార్లమెంట్ ప్రతిరూపాన్ని ఏర్పాటు చేశారు.




Post a Comment

0Comments

Post a Comment (0)