గుజరాత్ లోని కచ్ జిల్లాలోని కండ్లా పోర్టుకు సమీపంలో ఉన్న కంటెయినర్ స్టేషన్లో డ్రగ్స్ ఉన్నాయంటూ గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్)కు విశ్వసనీయవర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) కలిసి రంగంలోకి దిగిన ఏటీఎస్ అధికారులు కండ్లా పోర్ట్లోని కంటెయినర్ స్టేషన్లో తనిఖీలు చేపట్టారు. అధికారులు తనిఖీలు చేస్తున్న సమయంలోనే కంటెయినర్ లోపల భారీగా హెరాయిన్ దాచి తరలిస్తుండగా పట్టుకున్నారు. కంటైనర్ తెరిచి చూడగా అందులో 260 కిలోల హెరాయిన్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీని విలువ రూ.1300 కోట్లుగా ఉంటుందని డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. గతంలో ముంద్రా పోర్టులో రెండు కంటెయినర్లలో రూ.21 వేల కోట్ల విలువైన 2,988 కిలోల హెరాయిన్ ను అధికారులు పట్టుకున్నారు. 2021 సెప్టెంబర్లోనూ డ్రగ్స్ సీజ్ చేశారు.
1300 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
April 22, 2022
0
Tags