తెలంగాణలో రూ. 1000 జరిమానా
December 02, 2021
0
తెలంగాణలో ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులను జారీచేసింది. మాస్క్ ధరించకుంటే వెయ్యి రూపాయల జరిమానాను విధించనున్నట్లు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో, ఆఫీసుల్లో మాస్క్ నిబంధన అమలయ్యేలా చూడాలని వైద్యారోగ్యశాఖ ఆదేశాలు జారీచేసింది. అదే విధంగా బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు ఎక్కడికి వెళ్లిన వ్యాక్సినేషన్ పత్రం తప్పనిసరిగా అమలయ్యేలా చూస్తామన్నారు.