కర్ణాటకలోని హోస్పేటకు చెందిన గంగాధర్ (34) తన పేరు మీద రూ.5 కోట్లకు బీమా చేయించుకున్నాడు. ఈ విషయం తెలిసి ఓ ముఠా పక్కాగా ప్లాన్ వేసి గంగాధర్ ను అంతమొందించింది. ఆపై గంగాధర్ మృతదేహాన్ని శివార్లలోకి తీసుకెళ్లి టీవీఎస్ స్కూటర్ పై కూర్చోపెట్టి కారుతో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గంగాధర్ చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత ముఠాకు చెందిన మహిళ బీమా డబ్బుల కోసం తానే గంగాధర్ భార్యనంటూ ఇన్సూరెన్స్ కంపెనీని ఆశ్రయించింది. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి చనిపోయాడంటూ సమాచారం అందడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గంగాధర్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య శారదమ్మకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వాహన ప్రమాదంలో గంగాధర్ చనిపోయాడని పోలీసులు చెప్పగా, శారదమ్మ సందేహం వ్యక్తం చేశారు. తన భర్త పెరాలసిస్ బారిన పడ్డారని, కోలుకున్నాక శరీరంలో ఎడమవైపు భాగం పనిచేయడంలేదని వివరించారు. అలాంటి వ్యక్తి టూవీలర్ నడపడం ఎలా సాధ్యమని ప్రశ్నించింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ముఠా పన్నిన కుట్రను ఛేదించారు. 24 గంటల్లోనే ముఠా సభ్యులందరినీ అరెస్టు చేశారు.
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం వ్యక్తిని హత్య చేసిన ముఠా
October 04, 2025
0
Tags