ప్రియురాలిని కలిసేందుకు గోడ దూకిన ప్రియుడు : విద్యుత్‌ వైర్‌ తగలడంతో మృతి

Telugu Lo Computer
0


డిశాలోని దెంకనల్ జిల్లాలో సెప్టెంబర్ 28న రాత్రి వేళ రహస్యంగా ప్రియురాలిని కలిసేందుకు 18 ఏళ్ల బిశ్వజిత్ బెహెరా ప్రయత్నించాడు. ఆమె ఇంటికి వెళ్లి గోడ దూకాడు. అయితే విద్యుత్‌ వైర్‌ తగలడంతో షాక్‌తో అక్కడ కుప్పకూలిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. బిశ్వజిత్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. అయితే తమ కుమారుడి మరణంపై అతడి కుటుంబం అనుమానం వ్యక్తం చేసింది. ప్రియురాలి బంధువులు హత్య చేసినట్లు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం విద్యుదాఘాతానికి సంబంధించిన కేసుగా కనిపిస్తున్నదని పోలీస్‌ అధికారి తెలిపారు. ఆ యువకుడి మరణానికి ఖచ్చితమైన కారణం దర్యాప్తు తర్వాత తెలుస్తుందని చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)