ఏఐ మోడల్స్ హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉంది : గూగుల్ మాజీ సీఈవో ఎరిక్ ష్మిత్ హెచ్చరిక

Telugu Lo Computer
0


ర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉందని గూగుల్ మాజీ సీఈవో ఎరిక్ ష్మిత్ హెచ్చరించారు. ఎరిక్ ష్మిత్ ష్మిత్ 2001 నుంచి 2011 వరకు గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. గత వారం జరిగిన సిఫ్టెడ్ సమ్మిట్  లో మాట్లాడుతూ ఏఐ అణు ఆయుధాల కంటే ప్రమాదకరంగా మారే అవకాశం ఉందా అని అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ఏఐ వల్ల చెడు ఫలితాలు కూడా రావచ్చు అని పేర్కొన్నారు. ''ఏఐలో విస్తరణ సమస్యకు అవకాశం ఉందా? అంటే, ఖచ్చితంగా ఉంది'' అని ష్మిత్ పేర్కొన్నారు. ''మీరు మోడళ్లను... అవి క్లోజ్డ్ లేదా ఓపెన్ అయినా వాటి రక్షణ కంచెలనుతొలగించడానికి వాటిని హ్యాక్ చేయవచ్చనడానికి సాక్ష్యం ఉంది. కాబట్టి వాటి శిక్షణ సమయంలో అవి చాలా విషయాలు నేర్చుకుంటాయి. ఒక చెడ్డ ఉదాహరణ ఏమిటంటే, అవి ఎవరినైనా ఎలా చంపాలో నేర్చుకోవడం'' అని ష్మిత్ అన్నారు. అలాగే ప్రధాన ఏఐ కంపెనీలు ఇటువంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా మోడల్స్‌ను రూపొందించాయని ఆయన తెలిపారు. అయితే ఇవి రివర్స్ ఇంజనీరింగ్ చేయగలిగే పరిస్థితిలో ఉన్నాయని కూడా చెప్పుకొచ్చారు. ఏఐ మోడల్స్‌ను హ్యాకర్లు దానిని రివర్స్ ఇంజనీరింగ్ చేసి హానికరమైన ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చని, అప్పుడు అవి అటువంటి ప్రమాదకరమైన ప్రశ్నలకు ప్రమాదకరమైన సమాధానాలను అందించగలదనే అర్థం వచ్చే విధంగా మాట్లాడారు. అయితే ఏఐ విస్తరణ, భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నవారిలో ష్మిత్ మాత్రమే కాకుండా ఇతర ప్రముఖులు కూడా ఉన్నారు. ''ఏఐ  గాడ్ ఫాదర్''గా చాలా మంది భావించే జియోఫ్రీ హింటన్ కూడా మోడల్స్ వాటి భాషను అభివృద్ధి చేసుకోగలిగితే టెక్నాలజీ అదుపు తప్పుతుందని హెచ్చరించారు. ''ఇప్పుడు ఎక్కువ ఏఐ మోడల్స్ ఆంగ్లంలో ఆలోచిస్తాయి. కాబట్టి మనం అవి ఏమి చేస్తున్నాయో అర్థం చేసుకోగలం. కానీ ఇవి ఒకరోజు తమకంటూ ప్రత్యేక భాషను అభివృద్ధి చేసుకుంటే, మనకు అవి ఏం ఆలోచిస్తున్నాయో అర్థం కాదు'' అని హింటన్ చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో గూగుల్ డీప్‌మైండ్ ప్రచురించిన ఒక పరిశోధనా పత్రం ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ 2030 నాటికి రావచ్చని, మానవత్వాన్ని శాశ్వతంగా నాశనం చేయవచ్చని హెచ్చరించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)