ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అక్టోబర్ 13న అమరావతిలో నిర్మించిన సీఆర్డీఏ ఆఫీసు ప్రారంభం కానుంది. సీఆర్డీఏ ప్రాజెక్టు ఆఫీసును మొత్తం ఏడు అంతస్తులలో నిర్మించారు. 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వంలో నిర్మాణం ప్రారంభం కాగా, మధ్యలో అధికారం చేతులు మారటంతో పనుల్లో జాప్యం జరిగింది. ఎట్టకేలకు నిర్మాణం పూర్తి చేసుకున్న సీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే రాయపూడి సమీపంలో సీఆర్డీఏ కార్యాలయం నిర్మించారు. ఆకట్టుకునే ఇంటీరియర్ డిజైన్స్, ఆధునిక నిర్మాణ శైలితో సీఆర్డీఏ ఆఫీసు నిర్మించారు. ఈ కార్యాలయం అందుబాటులోకి వచ్చిన తర్వాత సీఆర్డీఏ కార్యకలాపాలు విజయవాడ నుంచి అమరావతికి మారనున్నాయి. 2014 టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఆర్డీఏ ఆఫీసు పనులు ప్రారంభించారు. 2019 నాటికి గ్రౌండ్ ఫ్లోర్, ఏడు అంతస్తుల స్ట్రక్చర్ పూర్తి చేశారు.
అమరావతిలో 13న సీఆర్డీఏ కార్యాలయం ప్రారంభం !
October 09, 2025
0
Tags