ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. బుధవారం ఉదయం జాతీయ రహదారిపై కారును టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో మరణించినవారిని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేశారు. కాగా.. ప్రమాదంలో మరణించిన వారి వివరాలు, ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
కారును టిప్పర్ ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి
September 17, 2025
0
Tags