కర్ణాటకలోని తుమకూరులోని దేవరాయణ దుర్గ ఆలయంలో పూజారిపై మహిళలు, యువకులు దారుణంగా దాడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కుంకుమ పూస్తూ ఓ మహిళ భక్తురాలితో అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ ఆలయ మెట్ల దగ్గర పూజారిని చుట్టుముట్టి ఇద్దరు మహిళలు, ఇద్దరు యువకులు ఆయనపై చేతులు, కర్రలతో దాడి చేశారు. సదరు పూజారి తనను కొట్టవద్దని దండం పెట్టాడు. మహిళ కాళ్లు మొక్కి వేడుకున్నట్లుగా వీడియోలో కనిపిస్తుంది. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన గురించి దాడికి గురైన పూజారి నాగభూషణాచార్య మీడియాతో మాట్లాడుతూ, "నిన్న మధ్యాహ్నం నాపై దాడి జరిగింది. నేను చేయని తప్పుకు నేను మానసికంగా బాధపడుతున్నాను. ఆలయ సంప్రదాయం ప్రకారం, ప్రసాదం ఇవ్వడానికి మాకు ఒక విధానం ఉంది. అందరికీ మంచి చేయాలనే ఉద్దేశ్యంతో నేను దాదాపు 25 సంవత్సరాలుగా ఈ సేవ చేస్తున్నాను. ఇప్పటివరకు ఎవరూ నా పట్ల చెడుగా ప్రవర్తించలేదు. నేను ఇప్పటివరకు గౌరవంగా జీవించాను" అని ఆయన అన్నారు. ఈ విషయం గురించి మా ఉన్నతాధికారులకు కూడా తెలియజేసాను. కాట్సంద్ర పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు కూడా చేశాను. నాకు న్యాయం చేయాలని నేను అభ్యర్థించాను అని పూజారి వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు ఇంకా అధికారికంగా కేసు నమోదు చేయలేదు. అయితే, పూజారి నాగభూషణాచార్య దాడి చేసిన వ్యక్తులు తన చర్యను తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను కేవలం కుంకుమ పెట్టే క్రమంలోనే అలా జరిగిందని వాదించాడు. ఈ సంఘటన దేవాలయాలలో మహిళల భద్రత, పూజారుల నైతిక ప్రవర్తనపై తీవ్ర చర్చకు దారితీసింది. నెటిజన్లు కూడా ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కర్ణాటకలో దేవరాయణ దుర్గ ఆలయ పూజారిపై దాడి
August 26, 2025
0
Tags