ఫెస్టివల్ సీజన్‌ను పురస్కరించుకుని దేశీయ మార్కెట్లో సందడి చేయనున్న కార్లు

Telugu Lo Computer
0


దేశీయ మార్కెట్లో ఫెస్టివల్ సీజన్‌ను పురస్కరించుకుని ప్రముఖ కార్ల కంపెనీలైన హ్యుందాయ్, టాటా, రెనాల్ట్ కొత్త ఎస్‌యూవీలను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాయి. సబ్-4 మీటర్ ఎస్‌యూవీ విభాగంలోకి రానున్న ఈ కార్లు స్టైల్, సేఫ్టీ, అడ్వాన్సుడ్ ఫీచర్ల కలయికతో వినియోగదారులను ఆకట్టుకుంటాయని అంచనా.

రెనాల్ట్ కిగర్ ఫేస్‌లిఫ్ట్ ఆగస్టు 24న విడుదల కానుంది. కొత్త కిగర్ ఫేస్‌లిఫ్ట్‌లో కొన్ని కాస్మెటిక్ మార్పులు ఉండవచ్చు. ముఖ్యంగా ముందు భాగంలో డిజైన్ అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది. లోపలి భాగంలో కొత్త టచ్‌స్క్రీన్, అప్‌డేటెడ్ సీట్ అప్హోల్‌స్టరీ ఉండవచ్చని తెలుస్తోంది. ఇంజిన్ పాత మోడల్‌లో ఉన్న 1.0-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్, టర్బో పెట్రోల్ ఇంజిన్‌లే కొనసాగుతాయి. సీఎన్‌జీ ఆప్షన్ కూడా లభిస్తుంది.

హ్యుందాయ్ వెన్యూ థర్డ్ జనరేషన్ అక్టోబర్ 24 నుంచి మార్కెట్‌లోకి రానుంది. కొత్త హ్యుందాయ్ వెన్యూలో చాలా మార్పులు ఉండనున్నాయి. దీని స్టైలింగ్, ఇంటీరియర్స్‌లో భారీ అప్‌డేట్స్ ఉంటాయి. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పెద్ద డిస్‌ప్లే స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్, ఏడీఏఎస్ వంటి ఫీచర్లు ఇందులో ఉండవచ్చు. క్రెటా, అల్కాజార్ కార్ల నుంచి కొన్ని డిజైన్ అంశాలు ఇందులో తీసుకొనే అవకాశం ఉంది. 1.0-లీటర్ టర్బో, 1.2-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ , 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లు కొనసాగుతాయి.

టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల అధికారికంగా ఇంకా ప్రకటించనప్పటికీ, దీపావళి సీజన్‌కు ముందు విడుదల కావచ్చని అంచనా. కొత్త స్పై ఫోటోల ప్రకారం, అప్‌డేటెడ్ పంచ్‌లో కొత్త ఫ్రంట్ గ్రిల్, సన్నని హెడ్‌ల్యాంప్‌లు, కొత్త ఎల్ఈడీ డీఆర్ఎల్ సిగ్నేచర్‌తో రావచ్చు. కొత్త అల్లాయ్ వీల్స్ కూడా ఇందులో ఉండవచ్చు. కొత్త అల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్ నుంచి తీసుకున్న టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, పెద్ద టచ్‌స్క్రీన్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్ ఆధారిత హెచ్‌విఏసి కంట్రోల్ ప్యానెల్ వంటి ఫీచర్లు ఇందులో ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుత ఇంజిన్ సెటప్ కొనసాగుతుంది.


Post a Comment

0Comments

Post a Comment (0)