ఆళ్లగడ్డలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును వెనక నుంచి ఢీకొన్న మరో బస్సు : ముగ్గురు మృతి, పలువురు గాయాలు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ వద్ద రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మణం చెందారు. జగన్ ట్రావెల్స్, శ్రీకృష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్సులు తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్నాయి. ఆళ్లగడ్డ సమీపంలో జగన్ ట్రావెల్స్‌ బస్సును వెనకాల నుంచి శ్రీకృష్ణ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్‌లోనే మరణించారు. పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పోలీసులు, 108 సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను బయటకు తీశారు. గాయపడినవారిని చికిత్స నిమిత్తం తరలించారు. మృతుల్లో శ్రీకృష్ణ ట్రావెల్స్‌ బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు, జగన్‌ ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న ఒకరు ఉన్నారు. అయితే వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంలో శ్రీకృష్ణ ట్రావెల్స్‌ బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదానికి గురైన వాహనాలను రోడ్డు మీద నుంచి తొలగించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)