గచ్చిబౌలిలో రాజమహేంద్రవరం డిప్యూటీ తహసీల్దార్‌ సహా 8 మంది అరెస్ట్‌

Telugu Lo Computer
0


హైదరాబాద్‌ డ్రగ్స్‌ కేసులో రాజమహేంద్రవరం డిప్యూటీ తహసీల్దార్‌ మణిదీప్‌ను గచ్చిబౌలిలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఓ అపార్ట్‌మెంట్‌లో నిర్వహించిన బర్త్‌డే పార్టీలో యువకులు డ్రగ్స్‌ తీసుకున్నట్లు ఈగల్‌ టీమ్‌ పోలీసులు గుర్తించారు. కీలక నిందితుడు విక్రమ్‌రెడ్డి సహా ఎనిమిది మందిని అరెస్ట్‌ చేశారు. వీరిలో డిప్యూటీ తహసీల్దార్‌తో పాటు ఇద్దరు యువతులు కూడా ఉన్నారు. బెంగళూరు నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)