2025-26 ఆర్థిక సంవత్సరంలో ఫ్రెషర్ల నియామకానికి కట్టుబడి ఉండాలని ప్రణాళికలు వేస్తున్నట్లు ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సలీల్ పరేఖ్ ప్రకటించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పెట్టుబడి పెట్టడం, ఉద్యోగులను తిరిగి నైపుణ్యం చేయడం ద్వారా టీసీఎస్ ముందుకు సాగగలిగిందని పరేఖ్ చెప్పారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 20,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలనే లక్ష్యానికి ఇన్ఫోసిస్ కట్టుబడి ఉంటుందన్నారు. భవిష్యత్ మార్గదర్శకాల ప్రకారం దిగువ స్థాయి ఉద్యోగుల సంఖ్యని 0% నుండి 1%కి పెంచిందన్నారు. ఇన్ఫోసిస్ ఇప్పటికే 17,000 మందిని నియమించుకుందని.. ఈ సంవత్సరం మరో 20,000 మంది కళాశాల విద్యార్థులను బోర్డులోకి తీసుకురావాలని యోచిస్తోందని పరేఖ్ చెప్పారు. కంపెనీ రీస్కిల్లింగ్, AI పై దృష్టి పెట్టిందన్న ఆయన.. దీని కోసం వివిధ స్థాయిలలో 2.75 లక్షలకు పైగా ఉద్యోగులకు శిక్షణ ఇచ్చిందని పేర్కొన్నారు. డిజిటల్ ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కంపెనీ పెట్టుబడులు పెట్టడంతో పాటు, సామర్థ్యాన్ని పెంచడానికి ఉద్యోగులను రీస్కిల్లింగ్ చేయడంపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ఈ విధానం ఐటీ మేజర్ అయిన ఇన్ఫోసిస్ కొత్త ప్రాజెక్టులపై ఎక్కువ మందిని నియమించడానికి సహాయపడుతుందని ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సలీల్ పరేఖ్ వెల్లడించారు.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఫ్రెషర్ల నియామకానికి కట్టుబడి ఉండాలని ప్రణాళికలు వేస్తున్నాం !
July 30, 2025
0
Tags