దేశంలో కరోనా క్రియాశీల కేసుల సంఖ్య 7,154కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 117 మందికి కరోనా సోకింది. కేరళ రాష్ట్రంలో అత్యధికంగా 2,165 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఆ తర్వాత గుజరాత్లో 1,281 కేసులు, పశ్చిమ బెంగాల్లో 747, ఢిల్లీలో 731, మహారాష్ట్రలో 615 కేసులు, కర్ణాటకలో 467, ఉత్తరప్రదేశ్లో 231, ఉత్తరప్రదేశ్లో 227 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో మూడు మరణాలు సంభవించాయి. మహారాష్ట్రలో ఇద్దరు, మధ్యప్రదేశ్లో ఒకరు మరణించారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకూ కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 77కి ఎగబాకింది. ఇక ఇప్పటి వరకూ 9,556 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
దేశంలో కరోనా క్రియాశీల కేసుల సంఖ్య 7,154
June 12, 2025
0
Tags