అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ల ఎగ్జిక్యూషన్ ప్లాన్ను సిద్ధం చేయడానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. ఇతర సంస్థల భాగస్వామ్యంతో బెంగళూరులోని డీఆర్డీవో-ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఏడీఏ) దీనిని అమలు చేయనుంది. ఐదో తరం యుద్ధ విమానం అడ్వాన్స్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ నమూనాను తొలిసారి ఏరో ఇండియా-2025లో ప్రపంచానికి పరిచయం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో దీన్ని రూపొందించిడానికి కసరత్తు చేస్తున్నారు. ఏఐ ఆధారిత ఎలక్ట్రానిక్ పైలట్, నెట్ ఆధారిత ఆయుధ వ్యవస్థల వంటి ప్రత్యేకతలు ఈ విమానం సొంతం. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఇది సమర్థంగా సత్తా చాటనుంది. 25 టన్నుల బరువు ఉండే ఈ విమానాన్ని మానవ రహితంగా పనిచేసేలా రూపొందించనున్నారు. భారతదేశం తన వైమానిక శక్తి సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి అధునాతన స్టెల్త్ లక్షణాలతో మీడియం వెయిట్ డీప్ పెనెట్రేషన్ ఫైటర్ జెట్ను అభివృద్ధి చేయడానికి ప్రతిష్టాత్మకమైన అమ్కా ప్రాజెక్ట్పై పని చేస్తోంది. స్వదేశీ రక్షణ సామర్థ్యాలను పెంపొందించడం మరియు బలమైన దేశీయ ఏరోస్పేస్ పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను పెంపొందించే దిశగా గణనీయమైన కృషిలో భాగంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మోడల్ను ఆమోదించినట్లు రక్షణ శాఖ తెలిపింది.
అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ల ఎగ్జిక్యూషన్ ప్లాన్ను సిద్ధం చేయడానికి మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం
May 27, 2025
0
Tags